English | Telugu

కాబోయే భార్య హరిణ్యరెడ్డి కి సర్ ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

-రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు మొదలు
-నాటు నాటు తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు
-హరిణ్యరెడ్డి, చాహల్ పిక్స్ వైరల్


ఆర్ఆర్ఆర్ లోని 'నాటునాటు' సాంగ్ తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన సత్తా చాటే రాహుల్ గాత్రం నుంచి ఇప్పటి వరకు సుమారు వంద పాటల దాకా వచ్చి అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. రాహుల్ కి హరిణ్య రెడ్డి తో తన స్వస్థలం హైదరాబాద్ లో ఈ నెల 27వ తేదీన వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకి పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా రీసెంట్ గా నిర్వహించిన సంగీత్ వేడుకలో హరిణ్యకు రాహుల్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.


హరిణ్యకి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ 'యుజ్వేంద్ర చాహల్' కి వీరాభిమాని. దీంతో రాహుల్ తన సంగీత్ వేడుకకి చాహల్‌ని ఆహ్వానించాడు. దీంతో హరిణ్య ఆనందానికి అవధులు లేవు. ఈ మేరకు చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలని హరిణ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రాహుల్ కి థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిణ్య కి రాహుల్ ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ లు ఇస్తూ సంతోషపెడుతున్నాడు. నిశ్చితార్థ సమయంలో కూడా హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.


Also read: రామ్ చరణ్ రికార్డుని ప్రభాస్ అందుకోగలడా!.. ప్రస్తుతానికి చరణ్ టాప్

రాహుల్ సినీ కెరీర్ ని చూసుకుంటే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిత్ర మండలి లో కత్తి అందుకో జానకి అనే సాంగ్ తో తనదైన స్టైల్లో అలరించాడు. నటుడుగాను అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పై మెరుసుతున్న విషయం తెలిసిందే.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.