English | Telugu

దర్శకురాలిగా పి.ఆర్.పి.లీడర్

పి.ఆర్.పి.అంటే ప్రజారాజ్యం అని కదా అర్థం.ఆ పార్టీ అధ్యక్షులు చిరంజీవి ఏకంగా 30 యేళ్ళ పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన సంగతి మనకు తెలిసిందే.ఆయన సుప్రీమ్ హీరో అయినా,మెగా స్టార్‍ అయినా, పద్మభూషణ్ అయినా, డాక్టర్ చిరంజీవి అయినా అదంతా తెలుగు సినిమా చలవే.ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి కూడా తన నాయకుని బాటలోనే నడవటానికి సన్నాహాలు చేస్తూందట.అలాగని ఆమె కూడా ఏ నటిగానో సినిమాల్లో నటించబోతూందని కాదు.దర్శకురాలిగా తెరంగేట్రం చేయనుందట శోభారాణి.ఈమె దర్శకత్వం వహించబోయే చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నతీస్తూందని సమాచారం.ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో నిర్మించే చిత్రమని తెలిసింది

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.