English | Telugu

ఫ్లాప్ సినిమా ఐదు వేల స్క్రీన్ లలో..

చైనాలో న్యూ ఇయర్ కి శంకర్ ఐ సినిమా అక్కడ విడుదల కానుంది. ఏకంగా ఒకేసారి ఐదు వేల స్క్రీన్ ల మీద ప్రదర్శితం కానుంది. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన 'ఐ' చైనా లో మాత్రం కాస్తంత లేటుగా విడుదల కానుంది. ఈ మేరకు చైనీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలుస్తోంది. అక్కడ సెన్సార్ షిప్ కూడా పూర్తయ్యిందని.. ఇక విడుదలే తరువాయి అని సమాచారం.చైనాలో ప్రతి యేటా కేవలం 50 విదేశీ సినిమాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ మేరకే అమనుతులు ఇస్తుంది. విదేశీ సినిమాలు వచ్చి తమ దేశ సినిమా మార్కెట్ ను దెబ్బతీయకుండా అక్కడి నియంతృత్వ కమ్యునిస్టు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొంటుంది. ఈ 50 సినిమాల్లో హాలీవుడ్ వే ఎక్కువగా ఉంటాయి. అడపాదడపా మాత్రం భారతీయ సినిమాలకు అవకాశం వస్తూ ఉంటుంది.ఇది వరకూ త్రీ ఇడియట్స్, ధూమ్ -3 వంటి సినిమాలు చైనాలో విడుదల అయ్యాయి..పర్వాలేదనిపించుకొనేలా వసూళ్లను సాధించాయి. ఇలాంటి నేపథ్యంలో ఐ కి ఎట్టకేలకూ అవకాశం దక్కింది. సినిమాను కొంత మేర చైనాలో చిత్రీకరించడం తో ఇది స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించగలదని నిర్మాతలు లెక్కలేసుకొంటున్నారు. తక్కువలో తక్కువ అనుకొన్నా ఈ సినిమాకు చైనా వ్యాప్తంగా 20 కోట్ల రూపాయల వరకూ వసూళ్లు దక్కుతాయని ఒక అంచనా.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.