English | Telugu

మహేష్, త్రివిక్రమ్ ని ఇంటర్వ్యూ చేసిన సమంత

'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦లో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలసి అందాల తార సమంత చేసిన ఈ ఇంటర్వ్యూ అందరిని ఆకట్టుకుంది. మహేష్‌ కెరీర్‌ గురించి సమంత, సమంత గురించి త్రివిక్రమ్‌.. ఇలా ప్రశ్నలడుగుతూ కార్యక్రమాన్ని రసవత్తరంగా కొనసాగించారు.ఈ ముగ్గురి పరస్పర ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాణ్‌ ప్రస్తావన రావడం. పవన్‌, మహేష్‌ చాలా విషయాల్లో ఒకేలా వ్యవహరిస్తారనీ, అదే తనను ఆ ఇద్దరికీ సన్నిహితుడ్ని చేసిందని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా ఎప్పుడని సమంత ప్రశ్నిస్తే, ఖచ్చితంగా 2015లో వుంటుందని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సమాధానమిచ్చారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.