English | Telugu

రాజమౌళి ఫాదర్ తో సల్మాన్ చర్చలు..ఆ మూవీపై త్వరలోనే అధికార ప్రకటన 

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman khan)ఈద్ కానుకగా మార్చి 30 న 'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవి చూసి సల్మాన్ అభిమానులని ఎంతగానో నిరాశపరిచింది.దీంతో సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ఎలాంటి కథాంశంతో తెరకెక్కిస్తాడనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది.

ఈ క్రమంలో తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'భజరంగీబాయ్ జాన్'(Bajrangi Bhaijaan)కి సీక్వెల్ తెరకెక్కించే యోచనలో సల్మాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ వార్తలకి బలం చేకూర్చేలా మొదటి పార్ట్ కి కథని అందచేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో సల్మాన్ చర్చలు జరుపుతున్నాడు.ఫస్ట్ పార్ట్ దర్శకుడు కబీర్ ఖాన్ నే సీక్వెల్ కి దర్సకత్వం వహిస్తున్నాడని,ఆల్రెడీ మూవీ కి సంబంధించిన పనుల్లో ఉన్నాడని కూడా తెలుస్తుంది.సీక్వెల్ పై త్వరలోనే ప్రకటన కూడా రానుందని బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

'భజరంగీ బాయ్ జాన్' 2015లో ప్రేక్షకుల ముందుకు రాగా పాకిస్థాన్ కి చెందిన షాహిదా అనే ఆరేళ్ళ పాప తప్పిపోయి ఇండియాకి వస్తుంది. ఆ పాపని అక్కున చేర్చుకొని తన కన్నవాళ్ళ దగ్గరకి పంపించే భజరంగీ క్యారక్టర్ లో సల్మాన్ ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.కరీనా కపూర్,నవాజుద్దిన్ సిద్ధికి,హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించారు.సల్మాన్,రాక్ లైన్ వెంకటేష్ 75 కోట్లతో నిర్మించగా 918 కోట్లపైనే వసూలు చేసింది.దీన్ని బట్టి చిత్ర విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.