English | Telugu

రాజమౌళి ఫాదర్ తో సల్మాన్ చర్చలు..ఆ మూవీపై త్వరలోనే అధికార ప్రకటన 

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman khan)ఈద్ కానుకగా మార్చి 30 న 'సికందర్'(Sikandar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవి చూసి సల్మాన్ అభిమానులని ఎంతగానో నిరాశపరిచింది.దీంతో సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ఎలాంటి కథాంశంతో తెరకెక్కిస్తాడనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది.

ఈ క్రమంలో తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'భజరంగీబాయ్ జాన్'(Bajrangi Bhaijaan)కి సీక్వెల్ తెరకెక్కించే యోచనలో సల్మాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ వార్తలకి బలం చేకూర్చేలా మొదటి పార్ట్ కి కథని అందచేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తో సల్మాన్ చర్చలు జరుపుతున్నాడు.ఫస్ట్ పార్ట్ దర్శకుడు కబీర్ ఖాన్ నే సీక్వెల్ కి దర్సకత్వం వహిస్తున్నాడని,ఆల్రెడీ మూవీ కి సంబంధించిన పనుల్లో ఉన్నాడని కూడా తెలుస్తుంది.సీక్వెల్ పై త్వరలోనే ప్రకటన కూడా రానుందని బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

'భజరంగీ బాయ్ జాన్' 2015లో ప్రేక్షకుల ముందుకు రాగా పాకిస్థాన్ కి చెందిన షాహిదా అనే ఆరేళ్ళ పాప తప్పిపోయి ఇండియాకి వస్తుంది. ఆ పాపని అక్కున చేర్చుకొని తన కన్నవాళ్ళ దగ్గరకి పంపించే భజరంగీ క్యారక్టర్ లో సల్మాన్ ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.కరీనా కపూర్,నవాజుద్దిన్ సిద్ధికి,హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించారు.సల్మాన్,రాక్ లైన్ వెంకటేష్ 75 కోట్లతో నిర్మించగా 918 కోట్లపైనే వసూలు చేసింది.దీన్ని బట్టి చిత్ర విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం