English | Telugu

10 నిమిషాల‌ పాట‌...రూ.2 కోట్ల ఖర్చు

ఈరోజుల్లో రెండు కోట్లు అంటే.. ఓ చిన్న సినిమా తీసేసి రిలీజ్ చేయొచ్చు. అలాంటిది కేవ‌లం ఒక్క పాట కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్ట‌డం విడ్డూర‌మే. రేయ్ కోసం వైవిఎస్ చౌద‌రి ఆ సాహ‌సం చేశాడు. వైవిఎస్ చౌద‌రి - సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్లో వ‌స్తున్న చిత్రం రేయ్‌. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.35 కోట్ల‌ని తెలుస్తోంది. ఓ డెబ్యూ హీరోకి ఈ లెవిల్లో ఖర్చు పెట్ట‌డ‌మే సాహ‌సం అనుకొంటే అందులో ఓ పాట కోసం రూ.2 కోట్లు కేటాయించార‌ట‌. రేయ్‌లో ఇది కీల‌క‌మైన పాట అట‌. క్లైమాక్స్‌లో వ‌చ్చే ఈ పాట సుమారు 10 నిమిషాల పాటు సాగుతుంద‌ట‌. క్లైమాక్స్ అంతా ఈ పాటేన‌ని టాక్‌. ఈ పాట కోసం 35 రోజుల పాటు క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. డాన్స్ మాస్ట‌ర్ ప్రేమ్‌ర‌క్షిత్ ర‌క‌ర‌కాల స్టెప్స్ కంపోజ్ చేశాడ‌ట‌. ఈపాట ఓ లెవెల్‌లో ఉండ‌బోతోంద‌ని వైవిఎస్ చౌద‌రి చెబుతున్నాడు. సినిమా బాగుంటే, హిట్ట‌యితే 'ఈ పాట భ‌లే తీశాడ్రా..' అంటారు. అదే నెగిటీవ్ రిజ‌ల్ట్ వ‌స్తే.. 'ఒక్క పాట కోసం మ‌రీ ఇంత ఖ‌ర్చు పెట్టాలా 'అని సెటైర్లు వేస్తారు. మ‌రి పాట చూశాక ప్రేక్ష‌కుడి కామెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.