English | Telugu

తెలుగులో "రేణుకాష్టం"

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సతీమణి రేణుకాదేశాయ్ నిర్మాతగా మారి తన మాతృభాష మరాఠీలో "మంగళాష్టకే ఒన్స్‌మోర్" అనే చిత్రాన్ని రూపొందిస్తుండడం తెలిసిందే. ఇదే పెద్ద వార్త అనుకొంటె.. తాను నిర్మిస్తున్న చిత్రానికి రేణు ఎంచుకొన్న కథాంశం మరింత పెద్ద వార్తగా మారింది.

"కొన్ని కలహాల కారణంగా కూలిపోబోతున్న తమ కాపురాన్ని ఓ జంట ఎలా కాపాడుకొంది" అన్న కథాంశంతో "మంగళాష్టకే ఒన్స్‌మోర్" తెరకెక్కుతుండడంతో ఈ అంశం పదే పదే వార్తలకెక్కుతోంది. ఎందుకంటె.. పవన్‌కళ్యాణ్_రేణుదేశాయ్ విడిపోయారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ఈ ప్రచారానికి ఊతమిస్తూ.. రేణుదేశాయ్ తెలుగులోకాకుండా మరాఠీలో ఓ చిత్రం నిర్మిస్తుండడం సహజంగనే చర్చనీయాంశమవుతోంది.

ఇకపోతే.. "మంగళాష్టకే ఒన్స్‌మోర్" చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్‌కు మంచి గిరాకి ఏర్పడుతోంది. ఈమేరకు రేణుదేశాయ్‌తో సంప్రదింపులు జరిపేందుకు పలువుతు నిర్మాతలు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తొంది!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.