English | Telugu

'బహుబలి' ఓవర్ సీస్ రైట్స్ అన్ని కోట్లా..?

టాలీవుడ్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'బహుబలి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ స్ధాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. దగ్గుబాటి రాణా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్ సీస్ రైట్స్‌ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ 9 కోట్లు తొలి భాగానికే మాత్రమేనట. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్ద ఆర్కా మీడియా సంస్ద నిర్మిస్తోంది. కె. రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువదించి ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇందులో నటిస్తున్న తారాగణం అంతా కత్తి యుద్దం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో ప్రతిదీ సంచనలమే. షూటింగ్ మొదలైనప్పటి నుండి రోజుకో వార్తతో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నెగిటివ్ రోల్‌లో కనిపించనుంది. అన్నదమ్ములుగా రాణా, ప్రభాస్‌లు కనిపిస్తారు. వీరిద్దరి మధ్య రాజ్యం కోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.