English | Telugu

ఏఆర్ రెహ్మాన్ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్ వచ్చాడా!

సంగీత సినీ ప్రపంచంలో ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)కి ఉన్న పేరు ప్రతిష్టలు గురించి అందరకి తెలిసిందే, సంగీత దర్శకుడికి కూడా వీరాభిమానులు ఉంటారని చాటి చెప్పిన అతి తక్కువ మందిలో రెహ్మాన్ కూడా ఒకడు.ఆస్కార్ ని సైతం అందుకొని భారతీయ సినీ ప్రపంచానికి ఎనలేని కీర్తిని గడించి పెట్టాడు.రోజా,దళపతి,ప్రేమికుడు, జెంటిల్ మెన్, భారతీయుడు,ఒకే ఒక్కడు,తాల్,లగాన్,దిల్ సే,స్లమ్ డాగ్ మిలినియర్,రాయన్ ఇలా చెప్పుకుంటు పోతే ఒకటి కాదు ఎన్నో సినిమాలకి అద్భుతమైన బాణీలని అందించి ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిపోయే బాణీలని అందిస్తూ వస్తున్నాడు.

రెహ్మాన్ ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan)బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ కూడా అధికారకంగా వెల్లడించింది.కానీ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో రెహ్మాన్ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.కానీ ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ఆర్ సి 16 కి సంబంధించిన సన్నిహిత వర్గాలు వ్యక్తం చేసాయి.ఇప్పటికే రెహ్మాన్ మూడు సాంగ్స్ కూడా ఇచ్చాడని,అంతే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారని అంటున్నారు

ఇక గేమ్ చేంజర్ ఫలితం నిరాశపరచడంతో రామ్ చరణ్ తన నూతన చిత్రం ఆర్ సి 16 ని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.పుష్ప 2 ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.