English | Telugu

రవితేజ, బ్రహ్మానందం మధ్యలో విలన్

మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందం రామోజీ ఫిల్మ్ సిటీలో విలన్ లతో ఆటాడుకుంటున్నారు. వీరిద్దరి కలిస్తే చేసే హంగామా ఎలా వుంటుందో, ఇది వరకే ఎన్నో సినిమాల్లో సినీ ప్రేక్షకులు చూసే వుంటారు. లేటెస్ట్ గా 'బెంగాల్ టైగర్' సినిమా కోసం కూడా వీరు విలన్ తో ఆడుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆ విషయం విలన్ కి తెలిసేసరికి వీరి వెంట పడ్డారట.

మన మాస్ మహారాజుకు వారిని వె౦టనే కొట్టేస్తే మజా వుండదు కదా. అందుకే వారందని తన చూట్టు ఫిల్మ్ సిటీ మొత్తం తిప్పుకొని, ఆతరువాత చితక్కోట్టాడట. ప్రస్తుత౦ బెంగాల్ టైగర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రవితేజ తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బోమన్ ఇరాని ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.