English | Telugu

రవితేజతో యుటివి సినిమా లేదోచ్

రవితేజతో యుటివి సినిమా లేదోచ్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మాస్ మహరాజా రవితేజ హీరోగా, త్రిష హీరోయిన్ గా, బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన "బ్యాండ్ బాజా బారాత్" సినిమాని తెలుగులో "చిక్ బమ్ చిక్" పేరుతో రీమేక్ చేస్తున్నారని మీడియా నానా గోలచేసింది. అదీ గాక ఈ "చిక్ బమ్ చిక్" చిత్రాన్ని ప్రఖ్యాత సినీనిర్మాణసంస్థ యుటివి నిర్మిస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ యుటివి సంస్థ ప్రతినిధి ఒకరు "తెలుగులో మేము అలాంటి సినిమా ఏది చేయటం లేదనీ, అసలా సినిమాకూ మాకూ ఎలాంటి సంబంధం లేద"నీ ఘంటాపధంగా నొక్కి వక్కాణించారు.

ఈ విషయాలేమి తెలియని హీరో రవితేజ పాపం తన మానాన తాను తన "వీర" సినిమా షుటింగులో యమ బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న చిత్రమే "వీర". ఈ చిత్రం తాలూకు షుటింగ్ ఇటీవల మారిషస్ లో జరిగింది. అక్కడ హీరో రవితేజ, హీరోయిన్ తాప్సీలపై రెండు పాటలను, కొన్ని కీలక సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఏప్రెల్ 30 వ తేదీన రవితేజ, కాజల్ అగర్వాల్ పై ఈ చిత్రంలోని పాట చిత్రీకరణకు యూరప్ వెళ్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.