English | Telugu

ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యింది.. ఫస్ట్ మూవీ బయటకు రాలేదు..

రష్మిక మందన్న అంటే చాలు ఇండస్ట్రీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న హీరోయిన్. ఏ రోల్ ఐనా కానీ చిటికెలో చేసేస్తుంది. అలాంటి రష్మిక జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి వచ్చి జగపతిబాబుతో కూర్చుని ఆడిషన్స్ లో ఎలా రిజెక్ట్ అయ్యిందో చెప్పింది. (Rashmika Mandanna)

"నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో వద్దన్నారు. అప్పుడే అడిగాను ఎందుకు వద్దంటున్నారు అని. ఐతే ఇండస్ట్రీలో సపోర్ట్ సిస్టం అంటూ ఎవరూ లేరు. ఇండస్ట్రీ విధానం వేరు అని చెప్పారు. ఇండస్ట్రీలో నేను మనగలలేను అని వాళ్ళు భయపడ్డారు.

నేను బెంగుళూరులో డిగ్రీ చదువుతూ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. అప్పుడు మా పేరెంట్స్ వద్దు తిరిగి వచ్చేయి అన్నారు. అలా చదువుతున్నప్పుడే నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడు ఒకటి అర్ధమయ్యింది. నా ఫీచర్స్ కానీ నా ఫిజిక్ కానీ సినిమా వరల్డ్ సెట్ కాదు అన్న విషయం రెండు మూడు ఆడిషన్స్ ఇచ్చాక అర్ధమయ్యింది. ఒక మూవీ రిజెక్ట్ అయ్యింది. తర్వాత ఒక మూవీకి సెలెక్ట్ అయ్యాను. అందులో సిక్స్ యాక్టర్స్ ఉన్నారు. అంతా కొత్త వాళ్ళే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. అదొక కాలేజీ స్టోరీ. దాని పేరు గెలేరే-గెలిథియరే..ఐతే ఈ మూవీ కోసం ఒక మూడు నాలుగు నెలలు రిహార్సల్స్, ప్రేపరేషన్స్ చేస్తూ ఉన్నాను. మధ్యలో కాలేజీ, ఎగ్జామ్స్ కి వెళ్తూ ఉండేదాన్ని. ఐతే తర్వాత ఆ మూవీ ముందుకు వెళ్లాలేదు. దానికి ఏవో ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ వలన ఆ మూవీ బయటకు రాలేదు.

ఆ తర్వాత కొన్నాళ్ళకు నాకు కిరిక్ పార్టీ మూవీ కోసం కాల్ వచ్చింది. ఐతే ముందు భయం వేసింది. ఆడిషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ మూవీ రాలేదు. ఈ మూవీ పరిస్థితి ఏమిటా అనుకునేదాన్ని. షూటింగ్స్ చేయడం, తర్వాత ఎగ్జామ్స్ వెళ్లి రాసేదాన్ని. అలా ఫైనల్ గా నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను . ఇదంతా జరిగింది నా కాలేజ్ ఫ్రెండ్స్ కారణంగానే." అని చెప్పింది రష్మిక.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.