English | Telugu

వ‌ర్మ ఎవ‌రి ఎఫైర్లు బ‌య‌ట‌పెడ‌తాడో..

వ‌ర్మ చుట్టు వివాదాలు తిరుగుతాయో, లేదంటే వ‌ర్మ నే వివాదాల చుట్టూ తిరుగుతాడో తెలీదు గానీ వ‌ర్మ న్యూస్ మేక‌ర్ అయిపోయాడు. వ‌ర్మ ఎఫైర్లు అనే టాపిక్ మీద ఓ పుస్త‌క‌మే రాయొచ్చు. దాదాపు తాను ప‌నిచేసిన అంద‌రు హీరోయిన్ల‌తోనూ స‌న్నిహితంగా ఉన్నాడు. వాళ్ల‌తో వ‌ర్మకు మీడియా చాలాసార్లు లింకులు క‌ట్టి.. వార్త‌లు సృష్టించింది. ఇప్పుడు వ‌ర్మ కూడా ఆ ఎఫైర్ల‌ను తెర‌పై చూపించ‌బోతున్నాడు. వ‌ర్మ తాజాగా స‌చిన్ జోషీని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు ఎఫైర్‌! తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమా పేరుని బ‌ట్టి చెప్పేయొచ్చు, కంటెంట్‌లో ఎంత మ‌సాలా ఉంటుందో. బాలీవుడ్, టాలీవుడ్‌లోని ఎఫైర్ల‌ను వ‌ర్మ ఈ సినిమా ద్వారా బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాడ‌ని స‌మాచారం. హై ఫై సొసైటీలో అక్ర‌మ సంబంధాలు ఎలా సాగుతున్నాయో... ఎఫైర్ ద్వారా చూపించ‌బోతున్నాడ‌ట‌. తాను చూసిన‌, విన్న (అనుభవించిన ) సంఘ‌ట‌న‌లూ ఈసినిమాలో పొందు ప‌ర‌చ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి వ‌ర్మ మ‌రోసారి టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌ను కుదిపేసే మేట‌ర్‌తో వ‌స్తున్నాడు. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.