English | Telugu

రాంచరణ్ తండ్రి కోసం వేట

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి "గోవిందుడు అందరివాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో చరణ్ కు తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై జగపతి స్పందిస్తూ... "ఆ పాత్ర కోసం కృష్ణవంశీ తనని సంప్రదించిన మాట నిజమే కానీ, తాను సున్నితంగా తిరస్కరించాను అని అన్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. వంశీ చెప్పినటువంటి ఆఫర్స్ కూడా బోలెడన్ని వస్తున్నాయి అని అన్నారు. నటుడు శ్రీహరి చనిపోయిన తర్వాత ఆ స్థానంలో సరైన నటుడి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకు తాను మరో అవకాశంగా మారాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.