English | Telugu

నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే  


దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
రాజు వెడ్స్ రాంబాయి ఎలా ఉండబోతుంది!
ఖమ్మం, వరంగల్ బోర్డర్ లో జరిగిన కథ

ఒక సినిమా అన్ని హంగుల్ని హద్దుకొని సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ప్రధాన మూలస్థంభంగా నిలిచే వ్యక్తి దర్శకుడు. అటువంటి దర్శకులకి తమ సినిమా ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంటుంది. కానీ అంతిమ తీర్పు మాత్రం ప్రేక్షకులదే. కానీ ఈ మధ్య కాలంలో సదరు ప్రేక్షకులకి దర్శకులు సవాలు విసురుతున్నారు.


ఈ నెల 21 న 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju weds rambai)అనే మూవీ రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా అఖిల్ రాజ్(AKhil Raj)తేజస్వి రావు(Tejaswi Rao)జంటగా నటించారు. సాయిలు కంపాటి(Saailu Kaampati)రచన దర్శకత్వం వహించాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతు నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్ధనగ్నంగా తిరుగుతాను అనే వైరల్ కామెంట్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రియులు స్పందిస్తు సినిమా బాగుంటే ఖచ్చితంగా మంచి టాక్ తో రన్ అవుతుంది. బాగున్నసినిమాని కావాలని ఎవరైనా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఎవరు నమ్మరు. సినిమాకి అంత శక్తీ ఉంది. అలాంటిది ఈ రకంగా బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఎందుకనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


also read:ఎవరు ఎటు వైపు.. ఏం జరగబోతుంది!

మరి కొంత మంది స్పందిస్తు ఒక వేళ సినిమా బాగోక నెగిటివ్ టాక్ వస్తే నిజంగానే అమీర్ పేట లో తిరుగుతాడా ఏంటనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సురేష్ బొబ్బిలి సంగీత సారధ్యంలో రాహుల్ మోపిదేవి నిర్మించగా, ఖమ్మం, వరంగల్ బోర్డర్ కి సంబంధించి ఒక ఏరియాలో జరిగిన నిజజీవిత క్యారెక్టర్స్ ఆధారంగా 'రాజు వెడ్స్ రాంబాయి' తెరకెక్కింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.