English | Telugu

పార్టీ చేసుకున్న సూప‌ర్‌స్టార్‌

హిమాల‌యాల నుంచి, త‌న ఆధ్యాత్మిక ట్రిప్ నుంచి తిరిగి వ‌చ్చేశారు త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్. వ‌చ్చీరాగానే జైల‌ర్ టీమ్‌ని పిలిచి సెల‌బ్రేట్ చేసుకున్నారు. జైల‌ర్ ఇప్పుడు 500 కోట్ల మార్కు దాటేసింది. ఈ సంద‌ర్భంగా పెద్ద కేక్ క‌ట్ చేశారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సినిమా జైల‌ర్‌. ప్ర‌పంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయ‌లను క‌లెక్ట్ చేసింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాద్షాగా నిలుచుంది. ఐకాన్ స్టార్‌డ‌మ్‌కి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు చెన్నై క్రిటిక్స్. ప్యాన్ ఇండియ‌న్ సినిమాగా విడుద‌ల చేశారు జైల‌ర్‌ని.

సూప‌ర్‌స్టార్ అరేంజ్ చేసిన పార్టీకి సినిమా డైర‌క్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్‌, కంపోజ‌ర్ అనిరుద్ ర‌విచంద‌ర్‌, ర‌మ్య‌కృష్ణ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. డైర‌క్ష‌న్‌, ప్రొడ‌క్ష‌న్ టీమ్ కూడా ఈ పార్టీకి హాజ‌రైంది.
త‌న ట్రిప్ కంప్లీట్ చేసుకుని చెన్నైకి తిరిగి వ‌చ్చిన‌ప్పుడే ర‌జ‌నీకాంత్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. సినిమా విడుద‌ల‌కు ఒక రోజు ముందే నార్త్ ట్రిప్ వెళ్లిన‌ట్టు తెలిపారు. సీఎం ఆదిత్య‌నాథ్ యోగి కాళ్లకు న‌మ‌స్క‌రించిన విధానం కూడా వైర‌ల్ అయింది. అయితే అందులో త‌ప్పేం లేద‌ని, త‌న‌క‌న్నా చిన్న వాళ్లైన‌ప్ప‌టికీ సాధువుల‌కు తాను మొక్కుతాన‌ని అన్నారు ర‌జ‌నీకాంత్‌.

ఇప్ప‌టిదాకా త‌మిళ‌నాడులో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా ఉంది ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.0. 750 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు తెచ్చుకున్న మూవీగా రికార్డుల్లో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాన్ని మొన్న మొన్న‌టిదాకా కేప్చ‌ర్ చేసింది పొన్నియిన్ సెల్వ‌న్ 1. ఈ సినిమాను ప‌క్క‌కు తోసి ఇప్పుడు సెకండ్ ప్లేస్‌ని కూడా తానే క‌బ్జా చేశారు ర‌జ‌నీకాంత్‌. 500 కోట్ల ప్ల‌స్ గ్రాస్‌తో జైల‌ర్ సినిమా రెండో స్థానాన్ని ఆక్యుపై చేసింది.

జాకీ ష్రాఫ్‌, త‌మ‌న్నా భాటియా, సునీల్‌, మిర్న మీన‌న్‌, వ‌సంత్ ర‌వి, యోగిబాబు, నాగ‌బాబు, కిశోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా జైల‌ర్‌.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.