English | Telugu

కమల్ హాసన్ ని పిలవాల్సింది.. ఎన్టీఆర్ శత జయంతి సభలో చేసిన వ్యాఖ్యలని గుర్తు చేసిన రజనీ   

తమిళ సూపర్ స్టార్ 'రజినీకాంత్'(Rajinikanth)తన అప్ కమింగ్ మూవీ 'కూలీ'(Coolie)తో ఆగష్టు 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna)ముఖ్య పాత్రలో చేస్తుండంతో పాటు, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో 'కూలీ'పై అభిమానులతో పాటు సౌత్ సినీ పరిశ్రమ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా రజనీ చెన్నై వేదికగా జరిగిన 'వేల్పారి' పుస్తక విజయోత్సవ సభకి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రామకృష్ణ ఆశ్రమం(Ramakrishna Ashramam)వల్ల పుస్తక పఠనం అలవాటు అవ్వడంతో,ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పుస్తకాలు చదివాను. 'వేల్పారి'(vel pari) పుస్తకం చదవడం ఇరవై ఐదు శాతం పూర్తి చేశాను. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక మొత్తం కంప్లీట్ చేస్తాను. నిజానికి ఇలాంటి ఫంక్షన్స్ కి మేధావులైన కమల్ హాసన్ , శివకుమార్ లాంటి వాళ్ళని పిలవాలి. డెబ్భై ఐదేళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్లో మోషన్ లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్ధం కావడం లేదు. ఈ ఈవెంట్ లో ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. గతంలో ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 'మనం ఏం మాట్లాడాలనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడాలనేది స్టేజ్. ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అని చెప్పాను. దాంతో నా మాటలు వివాదానికి దారి తీశాయని చెప్పుకొచ్చాడు.

ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు తెలుగుదేశం(TDP)పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్(Ntr)శత జయంతి ఉత్సవాలకి రజనీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన పైన చెప్పిన వ్యాఖ్యలు చేసాడు. దాంతో అప్పటి ప్రభుత్వానికి చెందిన కొంత మంది రజనీ ని విమర్శించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలని వేల్పారి పుస్తక సభలో రజనీ గుర్తు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రచయిత 'సు వెంకటేశన్'(su Vekatesan)రాసిన ఉత్తమ రచనలలో 'వేల్పారి' కూడా ఒకటి. ప్రాచీన కాలంలో 'వేల్పారి' అనే రాజు తమిళ సాహిత్యానికి చేసిన కృషితో పాటు పలువురుతో చేసిన యుద్దాలు గురించి పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం