English | Telugu

నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా 

తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై లెజండ్రీ యాక్టర్స్ నటకిరీటి 'రాజేంద్రప్రసాద్'(Rajendraprasad),కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam)కి ఉన్న చరిష్మా తెలిసిందే. ఏ క్యారక్టర్ లోకైనా పరకాయప్రవేశం చేసి సదరు క్యారెక్టర్స్ ని అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో సజీవ రూపంగా నిలిచేలా చెయ్యడంలో ఆ ఇద్దరు స్పెషలిస్ట్స్. అందుకే మోస్ట్ వాంటెడ్ నటులుగా మారారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఇద్దరి కాంబో కి మంచి క్రేజ్ ఉంది.

ప్రస్తుతం ఈ ఇద్దరు 'స:కుటుంబానాం' అనే కొత్త చిత్రంలో కలిసి చేస్తున్నారు. రీసెంట్ గా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇద్దరు హాజరయ్యారు. సదరు ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం అని రాజేంద్ర ప్రసాద్ అనగానే బ్రహ్మనందం అందుకొని ఎంత మాట్లాడినా మీ శిష్యులమే కదా అని అన్నాడు. ఆ తర్వాత బ్రహ్మ్మనందం ని ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు ఎంతైనా నువ్వు ముసలి ముండా కొడుకువి కదా అని అన్నాడు. వెంటనే మళ్ళీ బ్రహ్మానందం అందుకొని ఎవరు అనగానే నేను అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ప్రస్తుతం ఈ మాటల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇక స:కుటుంబానాం(Sahakutumbaanaam)చిత్రం డిసెంబర్ 12 న రిలీజ్ కి సిద్ధమవుతుండగా రామ్ కిరణ్, గిరిధర్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్ లుగా కనిపిస్తున్నారు. ఉదయ్ శర్మ(Uday sharma)దర్శకుడు కాగా హెచ్ ఎన్ జి సినిమాస్ నిర్మిస్తుంది.



'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.