English | Telugu

రాధిక ఇంట్లో తీవ్ర విషాదం.. భారీగా తరలి వెళ్తున్న అభిమానులు  

సీనియర్ నటీమణి 'రాధిక'(Radhika)గురించి తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. ఆమె కోసమే దర్శక, రచయితలు క్యారక్టర్ ని సృషించారా, అనేలా తన నట ప్రస్థానం కొనసాగింది. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన నటించి, తెలుగు సినిమా చరిత్రలో తన కంటు ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకుంది. గత నెలలో 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' లో సంగీత విధ్వంసురాలి క్యారక్టర్ లో చేసి తన సత్తా చాటిన రాధిక, టెలివిజన్ రంగంలోను తన కంటు బ్రాండ్ సృష్టించుకుంది.

నిన్న రాధిక తల్లి 'గీతా రాధా'(Geetha Radha)చనిపోయారు.ఈ విషయాన్ని మీడియా ద్వారా రాధిక తెలియచేసింది. గీతారాధా వయసు ఎనభై ఆరు సంవత్సరాలు కాగా, వృద్దాప్య సమస్యలు తలెత్తడంతోనే ఆమె తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్ధం భౌతిక దేహాన్ని రాధిక నివాసముంటున్న 'పోయస్ గార్డెన్' లో ఉంచడంతో పాటు. బీసెంట్ నగర్ లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడి చేసారు. శ్రీలంక కి చెందిన 'గీతా రాధా' కొన్ని చిత్రాల్లో కూడా నటించడం జరిగింది.

గీతా రాధా భర్త, రాధిక తండ్రి 'ఎం ఆర్ రాధా' తెలుగు వ్యక్తి. తమిళ చిత్ర పరిశమ్రలో అనేక చిత్రాల్లో హీరోగా చేసి తన సత్తా చాటాడు. పొలిటీషియన్ గాను తమిళ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గీతా రాధా ఆయనకి మూడో భార్య. రాధిక పెద్ద కూతురు కాగా మరో హీరోయిన్ నిరోషా(Nirosha)రెండో కూతురు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.