English | Telugu

రామ్ చరణ్, సంపత్ నందిల రచ్చ జూన్ 1 నుంచి

రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" జూన్ 1 నుంచి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో రాం చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" చిత్రం ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.

రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" కోసం హీరో రామ్ చరణ్ అమెరికాలోని మియామీలో అంతర్జాతీయ జిమ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. రామ్ చరణ్, సంపత్ నందిల "రచ్చ" ఒక విభిన్నమైన మాస్ ఓరియెంటెడ్ కథనీ, ఇందులో అంతర్లీనంగా ఒక అందమైన ప్రేమ కథ కూడా జొప్పించారనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. తన తొలి చిత్రం "ఏమైంది ఈ వేళ" తోనే యువతను ఆకట్టుకున్న యువదర్శకుడు సంపత్ నంది ఈ "రచ్చ" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోని కలెక్షన్ల రికార్డులను రచ్చ రచ్చ చేయనున్నాడని సినీ వర్గాలంటున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.