English | Telugu

ఆది సినిమాతో మనోజ్ హ్యాపీ

ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాదులో జరిగింది. తొలి సిడీని మంచు మనోజ్ ఆవిష్కరించారు. సాయికుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ... "నా పాట ఈ సినిమాకు టైటిల్ అవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇందులో ఆది నటిస్తున్నాడని తెలిసి ఇంకా ఆనందం కలిగింది. ఆది డాన్స్, అనూప్ పాటలు చాలా బాగున్నాయి" అని అన్నారు. ఆది మాట్లాడుతూ..."ప్రేమకథలకు సంగీతమే ప్రాణం. ఈ సినిమా ఫలితంలో సగభాగం అనూప్ రూబెన్స్ కే చెందుతుంది. నిర్మాత రాధామోహన్ ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇది అందరికి నచ్చుతుంది" అని అన్నారు. ఈ కార్యక్రమానికి నాని, కె.అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, చైతన్య కృష్ణ, నవదీప్, రకూల్ ప్రీత్ సింగ్. ఎరికా ఫెర్నాండేజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.