English | Telugu

నితిన్ - పూరి మ‌ధ్య క్లాష్‌

చిత్ర‌సీమ పేరుకు త‌గ్గ‌ట్టే మ‌హా విచిత్ర‌మైంది. ఏ కాంబినేష‌న్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, ఏ సినిమా ఎప్పుడు, ఎందుకోసం మ‌ధ్య‌లో ఆగిపోతుందో చెప్ప‌లేం. ఇప్పుడు నితిన్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబో ప‌రిస్థితీ అంతే. హార్ట్ ఎటాక్ సినిమా ఫ్లాప్ అయినా.. ఈ కాంబినేష‌న్ మ‌ళ్లీ క‌లుస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

పూరి, నితిన్ కూడా 'ఓకే చేసేద్దాం' అనుకొన్నారు. ఈనెల 15నుంచి సినిమా మొద‌లెట్టాల‌ని ఫిక్స్ అయ్యారు. కానీ అంత‌లో ఏమైందో... ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని అటు పూరి, ఇటు నితిన్ కూడా ధృవీక‌రించారు. కార‌ణాలు మాత్రం చెప్ప‌డం లేదు. అయితే.. నితిన్ వ్య‌వ‌హారం న‌చ్చ‌క పూరి, పూరి చెప్పిన క‌థ సంతృప్తినివ్వ‌క నితిన్ ఇద్ద‌రూ టాటా చెప్పేసుకొన్నార‌ని టాక్‌.

నితిన్ మితిమీరిన జోక్యం.. పూరిని చికాకు తెప్పించింద‌ని వికినిడి. క‌థ‌లో, ఇత‌రత్రా వ్య‌వ‌హారాల్లో నితిన్ విప‌రీతంగా జోక్యం చేసుకొంటున్నాడ‌ని, అది న‌చ్చ‌క పూరి... ప‌క్క‌కు వెళ్లిపోయాడ‌ని తెలుస్తోంది. క‌థ బాగానే ఉన్నా.. ట్రీట్‌మెంట్ స‌రిగా లేద‌న్న నెపంతో నితిన్ కూడా.. ఈసినిమా వ‌ద్ద‌నుకొన్నాడ‌ట‌. దాంతో.. ఇద్ద‌రూ సినిమా మొద‌లెట్ట‌క ముందే 'తూచ్‌' చెప్పేసుకొన్నారు. అదీ సంగ‌తి. పోనీలెండి... స‌గం సినిమా అయ్యాక ఈ క్లాష్ వ‌స్తే.. కోట్ల‌కు కోట్లు న‌ష్టం వ‌చ్చేది. ముందే.. బ‌య‌ట‌ప‌డ్డారు. అదీ ఒక రకంగా మంచిదే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.