English | Telugu

సంగీత దర్శకుడిగా పూరీ జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సంగీత దర్శకుడిగా కూడా మారబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఇడియట్, ఔను వాళ్ళిద్దరూ ఇష్తపడ్డారు, పోకిరి వంటి సూపర్ హిట్లిచ్చిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ త్వరలో సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నారు. దీని కోసం తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా, తన అసోసియేట్ గోపీ దర్శకత్వంలో ఒక సినిమాని నిర్మిస్తూ, ఆ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాలనుకుంటున్నారట. దర్శక,

నిర్మాత పూరీ జగన్నాథ్ కు సంగీతంలో చక్కని అభిరుచి ఉన్నదనేది అందరికీ తెలిసిందే. అందుకే తానే సంగీతం ఎందుకు అందించకూడదని ఆయన ఆలోచనట. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రథాన పాత్రలో నటిస్తూండగా, ఛార్మీ తదితరులు నటిస్తున్న "బుడ్డా" క్యాప్షన్ "హోగా తేరా బాప్" అనే బాలీవుడ్ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.