English | Telugu

నంది అవార్డులపై సినీ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు నంది అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆ అవార్డులకు సినిమా వారు ఎంతో విలువ ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులకు బ్రేక్ పడింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం గానీ నంది అవార్డులపై దృష్టి పెట్టడం లేదు. అయితే ఈ విషయంపై తాజాగా ఇద్దరు సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆల్ టైం హిట్స్ లో 'మోసగాళ్లకు మోసగాడు' ఒకటి. కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని 4K లో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి కృష్ణ సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరి రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా నుంచి నంది అవార్డులకు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా.. ఆదిశేషగిరి రావు, అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

"తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులు అనేది అప్రస్తుతం అయిపోయింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వాటి మీద ఆసక్తి లేదు. సినీ పరిశ్రమ తన దారిలో తాను వెళ్తుంది. అయినా ఒకప్పటిలా ప్రభుత్వ అవార్డులకు ఇప్పుడు విలువ లేదని నేను అనుకుంటున్నాను" అని ఆదిశేషగిరి రావు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మైక్ అందుకున్న అశ్వినీదత్.. "ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ.. వాళ్ళకి ఇస్తారు. సినిమాకి అవార్డులు ఇచ్చే రోజులు మళ్ళీ రెండు మూడేళ్ళలో వస్తాయి" అని సంచలన కామెంట్స్ చేశారు.

"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే అర్హత సూపర్ స్టార్ కృష్ణకి ఉందని, ఆ దిశగా మీ వంతుగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా?" అనే ప్రశ్నకు కూడా ఆదిశేషగిరి రావు సంచలన సమాధానం ఇచ్చారు. "కృష్ణ గారు అవార్డులకు దూరం. వస్తే స్వీకరించారు అంతే. మేం ఎప్పుడూ అవార్డుల కోసం ప్రయత్నించలేదు. ఆయన అర్హుడు అని ప్రభుత్వం భావించి ఇవ్వాలి. అయినా ఇప్పుడు అవార్డులు అనేవి ప్రభుత్వాలు వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నాయి." ఆదిశేషగిరి రావు అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.