English | Telugu

నిర్మాత ఏఎం రత్నంకు అస్వస్థత.. అసలేం జరిగింది..?

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) అస్వస్థతకు గురైనట్లు ఈ ఉదయం వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఏఎం రత్నం మూవీ ఆఫీస్ కి వెళ్ళగా.. సడెన్ గా హై బీపీతో కళ్ళు తిరిగి పడిపోయారని న్యూస్ వినిపించింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని.. చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ప్రచారం జరిగింది.

ఏఎం రత్నం ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత దయాకర్ స్పందించారు. "అన్నయ్య ఏఎం రత్నం స్పృహ తప్పి పడిపోయాడనే పుకార్లను నమ్మవద్దు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా ఉండండి." అని దయాకర్ ట్వీట్ చేశారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం