English | Telugu

మాజీ బాయ్ ఫ్రెండ్‌కు ప్రియాంక నోటీసులు


బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మర్చంట్, మేనేజర్ ప్రకాష్ జాజుకు లీగల్ నోటీసులు పంపించింది.
ప్రియాంక మేనేజర్‌గా వ్యవహరించిన ప్రకాష్ జాజు జీవితం ఆధారంగా అసీమ్ మర్చంట్ ఒక సినిమా తీసెందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో ప్రియాంక తన గురించిన, తన కుటుంబం గురించిన విషయాలు ఏమైనా ఉంటాయేమో అని అభ్యంతరం చెప్తూ నోటీసులు పంపింది.
ఈ సినిమాలో తన క్లయింటుకు సంబంధించిన విషయాలు ఉన్నాయని వార్తలు బయటకు వచ్చాయని, అలా అయితే, దాని వలన తన క్లయింటు హక్కులకు భంగం కలుగుతుందని ఆ విషయాన్నే నోటీసులో పేర్కొన్నట్లు ఆమె తరపు న్యాయవాది ఆనంద్ దేశాయ్ వివరించారు.
ఈ విషయం మాటల ద్వారా కాకుండా నోటీసుల వరకు వెళ్లడానికి కారణం జాజు, చోప్రా మధ్య ఉన్న విభేదాలే కావచ్చు. ప్రియాంక తనకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తోందని గతంలో ప్రకాష్ జాజూ ఆరోపించారు. ఆ సమయంలో ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా జాజుపై కేసు ఫైల్ చేశారు. దీంతో జాజు రెండు నెలలకు పైగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ తతంగం అక్కడితో ముగిసిందనుకున్న ప్రియాంకకు ఇప్పుడు తాజాగా జాజూపై చిత్ర నిర్మాణం జరుగుతుందనే విషయం బాగా ఇబ్బంది పెడుతోంది. తన కుటుంబం గురించిన వివరాలు ఈ సినిమాలో ప్రస్తావించడం పై ప్రియాంక అందుకే అభ్యంతరం తెలిపింది. పైగా ఈ చిత్రాన్ని ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిర్మిస్తుండటం ఆమెను మరింత ఆలోచనలో పడేస్తోంది. వారిద్దరికీ ఈ విషయంలో నోటీసులు పంపింది ప్రియాంక.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.