English | Telugu

ఫిబ్రవరి 24 న"ప్రేమ కావాలి"ప్రీమియర్ షో

సినిమా విడుదలకు ముందు ఏ సినిమానైనా సినీ పరిశ్రమలోని ప్రముఖులకు ప్రీమియర్ షో చూపించటం మామూలుగా ఆనవాయితీ.దానికి ఏ థియేటర్లోనో ఒక షో వేస్తూంటారు.కానీ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆదిని హీరోగా పరిచయం చేస్తూ,కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న "ప్రేమ కావాలి" చిత్రాన్ని మాత్రం హైదరాబాద్ లో మూడు స్క్రీన్స్ మీద సినీ ప్రముఖులకు చూపిస్తున్నారు. ఒక వర్థమాన నటుడి చిత్రాన్ని మూడు థియేటర్లలో విడుదలకు ఒక రోజు ముందు సినిమా ప్రముఖులకు చూపించటమ చాలా అరుదు.అది ఆది ఈ చిత్రం హీరో సాయికుమార్ కొడుకవటం వల్ల, ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పించటం వల్లా, ఈ చిత్రాన్ని అచ్చిరెడ్డి వంటి సీనియర్ నిర్మాత నిర్మించటం వల్లా సాధ్యమయిందని చెప్పాలి. పన్నెండు కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కానుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.