English | Telugu

మ‌హేష్ అల‌ర్ట్ అయ్యాడు

చిన్న‌దో, పెద్ద‌దో సినిమా అనేస‌రికి ప‌బ్లిసిటీ చాలా ముఖ్యం. మీడియాలో సినిమా పేరు ఎంత మార్మోగితే... అంత ప‌బ్లిసిటీ గిట్టిన‌ట్టు. ప‌బ్లిసిటీ వ‌ల్ల సినిమా రేంజు ఎంత‌లా మారుతుందో చెప్ప‌డానికి బాహుబ‌లి సినిమానే ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాని ముందు నుంచీ అంత‌ర్జాతీయ సినిమా అన్న‌ట్టు మీడియా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది. దాంతో.. సినిమాకి ప్ల‌స్స‌య్యింది. భారీ వ‌సూళ్లు చేజిక్కించుకొంది. ఇప్పుడు ఆ ప‌బ్లిసిటీ మ‌హ‌త్తు.. మ‌హేష్‌బాబుకీ బాగా తెలిసొచ్చింది. త‌న శ్రీ‌మంతుడు సినిమా కూడా ఇలానే మీడియాలో నానాల‌ని నానా పాట్లూ ప‌డుతున్నాడు. మ‌హేష్ ఎప్పుడూ మీడియాకు వీలైనంత దూరంలో ఉంటాడు. సినిమా హిట్ట‌యితేనే గానీ ప్రెస్ మీట్ల‌కు రాడు, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డు. కానీ... శ్రీ‌మంతుడు విష‌యంలో మాత్రం మ‌హేష్ ఎల‌ర్ట్ అయ్యాడు. రిలీజ్ ఇంకా 20 రోజులున్నా.. ఇప్పుడే మీడియాకు ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు.

ఇంగ్లీష్ మీడియాలో వ‌రుస‌పెట్టి మ‌హేష్ ఇంట‌ర్వ్యూలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. ఈ సినిమాని భారీగా ప్ర‌మోట్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్ల‌కు కూడా మ‌హేష్ సూచించాడ‌ట‌. శ్రీ‌మంతుడు లాంటి సినిమాల‌కు భారీ ఓపెనింగ్స్ అత్య‌వ‌స‌రం. తొలి మూడు రోజుల్లో ఎంత దండుకొంటే అంత మంచిది. అందుకే.. ఈ సినిమాని భారీగా ప్ర‌మోట్ చేసి ఓపెనింగ్స్ రాబ‌ట్టుకోవాల‌నుకొంటున్నాడు మ‌హేష్‌. మ‌రి ఆ ప్లాన్ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.