English | Telugu

ప్రభాస్ మామూలోడు కాదు.. సైలెంట్ గా ఇంత చేశాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. రాజా సాబ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఫౌజి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. పెద్దగా హడావుడి లేకుండా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ప్రభాస్ మరో 30 రోజులు కేటాయిస్తే.. ఆయన పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణకు మరో 20 రోజులు పట్టే అవకాశముంది అంటున్నారు.

ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్లు ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం అరుదైపోయింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఓ వైపు 'రాజా సాబ్' చేస్తూ.. మరోవైపు 'ఫౌజి' షూటింగ్ ఇంత పూర్తి చేయడం మామూలు విషయం కాదు. 'ఫౌజి' చిత్రాన్ని 2026, ఏప్రిల్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.