English | Telugu

బిర్యానీతో ఫ్లాట్ చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌భాస్‌ని అంద‌రూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. మ‌న హీరోలే కాదు... త‌మిళ తంబీల‌కూ త‌ను డార్లింగే. త‌మిళ స్టార్ క‌థానాయ‌కుడు సూర్య‌కీ ప్ర‌భాస్ అంటే విప‌రీత‌మైన అభిమానం. ఇద్ద‌రి మ‌ధ్యా చాలా కాలం నుంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ స్నేహంతోనే సూర్య సినిమా రాక్ష‌సుడు ఆడియో వేడుక‌కు ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. అతిథి అంటే గుర్తొచ్చింది.. అతిథి మ‌ర్యాద‌ల విష‌యంలో ప్ర‌భాస్ రూటే సెప‌రేటు. భీమ‌వ‌రం బ్యాచీ క‌దా.. ఆ విష‌యంలో ఏమాత్రం లోటు చేయడు. సూర్య‌కీ త‌న అతిథి మ‌ర్యాద‌ల్ని చూపించాడు ప్ర‌భాస్‌. ఓసారి ఇద్ద‌రి షూటింగ్ ప‌క్క ప‌క్క‌నే జ‌రుగుతోంద‌ట‌. ఆ స‌మ‌యంలో రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ సూర్య కోసం ప్ర‌భాస్ ఎదురుచూస్తూ కూర్చున్నాడ‌ట‌. లేట్ నైట్ సూర్య షూటింగ్ ఫినిష్ చేసుకొని రాగానే.. ఇంటి నుంచి తీసుకొచ్చిన మిక్స్‌డ్ బిర్యానీ వేడి వేడిగా వ‌డ్డించాడ‌ట‌. ఆ టేస్ట్‌కి సూర్య ఫ్లాటైపోయాడ‌ట‌. ప్ర‌భాస్ ఆరోజు ప్రేమ‌తో వ‌డ్డించిన బిరియానీ రుచి ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేక‌పోతున్నా అంటున్నాడు సూర్య‌. అలా ఓ బిరియానీ వ‌ల్ల వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డిపోయింద‌న్న‌మాట‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.