English | Telugu

ప‌వ‌న్‌కి ఓ ద‌ర్శ‌కుడు కావ‌లెను!

అర్జెంటుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఓ ద‌ర్శ‌కుడు కావాలి. ప‌వ‌న్‌కి స‌రిప‌డా క‌థ‌తో వ‌స్తే... బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డానికి నిర్మాత‌లు, కెమెరా ముందుకు రావ‌డానికి ప‌వ‌న్ కూడా సిద్ధంగా ఉన్నాడు. విష‌యం ఏంటంటే.... ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీవీపీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది. అందుకే ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ 2 ప్రాజెక్టును ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టేశాడు. గోపాల గోపాల త‌ర‌వాత గ‌బ్బ‌ర్ సింగ్ 2 చేయాలి. కానీ పీవీపీ సంస్థ ఓ కోసం త‌న ఆలోచ‌న మార్చుకొన్నాడు. గోపాల గోపాల - గ‌బ్బ‌ర్ సింగ్ 2 గ్యాప్‌లో ఓ సినిమా చేసేద్దామ‌ని డిసైడ్ అయ్యాడు. కాక‌పోతే ప‌వ‌న్ ద‌గ్గ‌ర క‌థ‌లేం లేవు. ద‌ర్శ‌కుడూ లేడు. కాబ‌ట్టి.. ఇప్పుడా వేట‌లో ఉంది పీవీపీ సంస్థ‌. ప‌వ‌న్ కోసం అర్జెంటుగా ఓ క‌థ రెడీ చేసి, ద‌ర్శ‌కుడిని సెట్ చేసి... వీలైనంత త్వ‌ర‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు బాబి కూడా ప‌వ‌న్‌కి ఓ క‌థ వినిపించాడ‌ట‌. కోన వెంక‌ట్ అండ్ కో.. కూడా ప‌వ‌న్ కోసం మాస్ మ‌సాలా క‌థ రెడీ చేసే ప‌నిలో ప‌డ్డారు. మ‌రి ఎవ‌రి క‌థ ఓకే అవుతుందో, ఆ కథ‌కు ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వహిస్తారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.