English | Telugu

సినీ పరిశ్రమ ఏ ఒక్కరిది కాదు: పవన్

సాయిధరమ్ తేజ్ హీరోగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేయ్" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తేజ్ సినిమాల్లోకి వస్తాను అని అన్నప్పుడు.. నాకు తెలిసిన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కి పంపించాను. ఈ సినిమా కోసం నేనేం చేయలేదు. తేజ్ తో ఓ సినిమా చేస్తాను అని చౌదరి అడిగాడు. కానీ అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ విషయం తేజ్ ను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే నేను ఎలాంటి ఒత్తిడి చేయలేను కదా. నేను కేవలం మాట సహాయం మాత్రమే చేశాను. ఓ నటుడు ఏదైనా సాధించాలంటే అతని పట్టుదల, కృషి మీదే ఆధారపడి ఉంటుంది. వారసత్వం, కుటుంబం వల్ల సాధించలేరు అని తేజ్ తో చెప్పను. సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు. అందుకే మా కుటుంబానిది కాదు. అందుకే మా కుటుంబం నుంచి వస్తున్న హీరో అనడానికి ఇష్టపడటంలేదు. అందుకే నితిన్ లాంటి కొత్త కొత్త హీరోల ఆడియో ఫంక్షన్ లకు హాజరయ్యేవాడిని. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఈ కొత్త హీరోకి శుభాకాంక్షలు చెబుతున్నాను. అదే విధంగా "దేవదాసు" సినిమా సమయంలో చౌదరి గురించి విన్నాను. అతను చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. ఈ సినిమాకి చాలా కష్టాలొచ్చాయి. కానీ ఎక్కడ నీరసపడిపోకుండా చౌదరి పట్టుదలతో ఈ సినిమాను పూర్తి చేసారు. చక్రి సంగీతం నాకు ఇష్టం. ఆయన పాటలు చాలా ఊపుగా ఉంటాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.