English | Telugu

మరోసారి పవన్ రాక ఖరారు

పవన్ కళ్యాణ్ "జనసేన" అనే కొత్త పార్టీ పెట్టేసాడు. రాజకీయాల్లోకి వచ్చేసాడు. కానీ పవన్ రాజకీయాలపై రాస్తున్న పుస్తకం ఇంకా రాలేదు. మరి ఆ పుస్తకం సంగతి ఏంటి? అసలు ఆ పుస్తకంకు సంబంధించిన కొన్ని వివరాలు మీకోసం.

పవన్ రాసిన పుస్తకానికి "ఐఎస్ఎం" అంటే టైటిల్ పెట్టారు. ఈ పుస్తకాన్ని మార్చి 26న విడుదల చేయనున్నారు. ఈ పుస్తకాన్ని ప్రగతి పబ్లికేషన్ హౌస్ ప్రచురించారు. "జనసేన" పార్టీ ఆవిర్భావం కోసం తనకు అండగా ఉన్నాడని పవన్ చెప్పిన రాజు రవితేజ ఈ పుస్తకంలో భాగస్వామి అయ్యాడు. ఈ పుస్తకానికి "Ideology of Jana Sena Party" అనే ఉపశీర్షిక పెట్టారు.

జనసేన పార్టీ పెట్టినరోజు ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ ఎపుడు ప్రజల ముందుకు వస్తాడు అనే సందేహం అందరిలో ఉంది. మరి పవన్ మరోసారి మీడియా ముందుకు వచ్చేది ఈ పుస్తక ఆవిష్కరణ రోజు మాత్రమే కావచ్చు. మరి పవర్ స్టార్ రాక కోసం మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.