English | Telugu

ఓజీ మూవీ క్రేజ్.. ఒక్క టికెట్ ఐదు లక్షలు!

సెప్టెంబర్ 25న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నూతన చిత్రం 'ఓజీ'పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజీ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసి, సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ టికెట్ ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడవ్వడం సంచలనంగా మారింది. (They Call Him OG)

నైజాం ఏరియాకి సంబంధించి 'ఓజీ' మూవీ ఫస్ట్ టికెట్ ని తాజాగా వేలం వేశారు. వేలంలో ఈ టికెట్ ని 'టీం కళ్యాణ్ సేన' ఏకంగా రూ.5 లక్షలకు దక్కించుకుంది. వేలం ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నారట.

ఎంత ఫస్ట్ టికెట్ అయినప్పటికీ, ఒక మూవీ టికెట్ అనేది ఐదు లక్షలకు అమ్ముడవ్వడం మామూలు విషయం కాదు. దీనిని బట్టే 'ఓజీ' సినిమా పట్ల అభిమానుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత హైప్ ని చూస్తుంటే.. ఓజీ మూవీ ఓపెనింగ్స్ కళ్ళు చెదిరేలా ఉండటం ఖాయమనిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.