English | Telugu

పవన్ కళ్యాణ్ పై ప్రముఖ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..నేను దెయ్యాన్ని కాదు 

ఇస్మార్ శంకర్ హీరోయిన్ 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తో హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)'ప్రభాస్' (Prabhas)తో ది రాజాసాబ్(The raja saab)లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఒకేసారి ఇద్దరి బడా హీరోలతో జత కట్టడంతో పాటు రెండు సినిమాల షూటింగ్ లోను ఒకేసారి పాల్గొంటు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.


రీసెంట్ గా ఆమె ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పవన్ కళ్యాణ్ గారితో 'హరిహరవీరమల్లు'లో కలిసి చెయ్యడం మర్చిపోలేని అనుభూతి. ఆయన గొప్ప మేధావి తో పాటు చాలా ధైర్య వంతుడు.సాహిత్యంపై కూడా మంచి పట్టు ఉంది.ఎన్నికల్లో గెలిచి,డిప్యూటీ సి ఎం అవ్వకముందు ఏ విధంగా అయితే షూటింగ్ లో పాల్గొన్నారో, డిప్యూటీ సిఎం అయ్యాక కూడా అదే విధంగా షూటింగ్ లో పాల్గొంటు వస్తున్నారు.ఎలాంటి మార్పు లేదు. మూవీలోని క్యారక్టర్ కోసం రెండు నెలలు పాటు గుర్రపు స్వారీతో పాటు కథక్, భరత నాట్యంలో శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది

ఇక ఇదే ఇంటర్వ్యూ లో 'రాజాసాబ్' గురించి చెప్పుకొస్తు నేను రాజాసాబ్ లో దెయ్యం క్యారక్టర్ లో నటిస్తున్నాననే వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలన్నీ అబద్దం.నా క్యారక్టర్ చాలా వినోదాత్మకంగా సాగుతునే పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.ప్రభాస్ సెట్ లో చాలా సరదాగా ఉంటూ అందర్నీ నవ్విస్తాడని చెప్పుకొచ్చింది.



ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.