English | Telugu

పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి!..ప్రముఖ హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్ 

-ఆ హీరోయిన్ మాటల వెనక ఉన్న అంత్యరం ఏంటి!
-పవన్ కి అంత శక్తి ఉందా
-డౌన్ టూ ఎర్త్ మళ్ళీ ఖాయమా


'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అనే పేరుకి ఉన్న పవర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినీ రంగంలో ఎలా అయితే తన మేనరిజమ్స్, స్టైల్, డాన్స్, యాక్టింగ్ తో డౌన్ నుంచి స్టార్ గా ఎదిగారో రాజకీయాల్లోను అదే విధంగా డౌన్ నుంచి ఎదిగి ఆంధప్రదేశ్ ఉప ముఖ్య మంత్రిగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి. మరి అంతలా షేక్ చేస్తున్న న్యూస్ ఏంటో చూద్దాం.

నిధి అగర్వాల్(Niddhi Agerwal)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'పవన్ కళ్యాణ్ గారు సింహం లాంటి వ్యక్తి . ఒంటరిగా నిలబడి పోరాడగల దైర్యం ఆయన సొంతం.ప్రజల కోసం తన సిద్ధాంతాల కోసం రాజీపడకండా నిలబడే వ్యక్తిత్వం కూడా ఉంది. అలాంటి లక్షణాలు ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో ఆయన దేశ ప్రధాని అయితే నాకు ఏ మాత్రం ఆశ్చర్యం ఉండదు. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని కూడా ప్రభావితం చెయ్యగలరు అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.


Also read: Dhurandhar 2: ఈ రూమర్ నిజమైతే ఆపడం ఎవరి తరం కాదు

ప్రస్తుతం బెస్సి గా రాజా సాబ్ తో కలిసి సందడి చేస్తున్న నిధి అగర్వాల్ గత ఏడాది పవన్ కళ్యాణ్ తో కలిసి పంచమి అనే రాజనర్తకి గా హరిహర వీరమల్లుతో మెప్పించిన విషయం తెలిసిందే.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం