English | Telugu

ఇలా హిట్ట‌యిన ప్ర‌తి చిత్రానికి సీక్వెల్ అంటే ఎలా?!

నేచురల్ స్టార్ నాని హిట్ మూవీలలో నేను లోకల్ ఒకటి. ఇందులో నాని కి జోడీగా కీర్తిసురేష్ న‌టించింది. ఈ చిత్రానికి ధ‌మాకా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌కుడు. ధ‌మాకాకి ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడే ఈ చిత్రానికి కూడా ప‌నిచేశారు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన నేను లోక‌ల్ విజ‌యానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. పెద్ద‌గా క‌థాబ‌లం లేక‌పోయినా ప‌నిపాటా లేకుండా బేవ‌ర్స్ గా తిరిగే హీరో క్యారెక్ట‌ర్ లో న‌టించిన నాని న‌ట‌నా ప్ర‌తిభ‌తో పాటు ప‌నిపాటా లేని బేవ‌ర్స్ అనే పాయింట్ నేటి యూత్ కి బాగా క‌నెక్ట్ అయింది. చాలా మంది హీరో క్యారెక్ట‌ర్ లో త‌మ‌ను తాము లేదా త‌మ‌కు తెలిసిన వారితో పోల్చుకున్నారు. ప్ర‌తి వారికి ఇలాంటి వారు తార‌స‌ప‌డుతూనే ఉంటారు. ఇదే పాయింట్ యూత్ కి బాగా క‌నెక్ట్ కావ‌డం, నాని కూడా మ‌న ప‌క్కింటి కుర్రాడిలా రాణించ‌డం అనేవి ప్ల‌స్ పాయింట్స్ అయ్యాయి. న్యాచురల్ స్టార్ నాని పెర్ఫార్మన్స్ తో ఈ చిత్రం బాగా ఆడింది. ఎంటర్టైన్మెంట్ కథలో భాగంగా ఉండడంతో ఆరంభంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.

నాని పాత్ర మనలో ఒకడిగా ఉన్న‌ట్లుగా అనిపించేలా చేసింది. నాని పర్ఫామెన్స్ తో మెప్పించడంతో పాటు ఈ సినిమాకి మంచి ల‌క్ క‌లిసివచ్చింది. ఈ మూవీ పట్ల క్రిటిక్స్ పెదవి విరిచారు. అయినా సినిమా బాగా ఆడింది. ఈ మూవీతో త్రినాథ‌రావు న‌క్కిన‌-ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌ల కాంబినేషన్ కు మంచి ఫేమొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా త్రినాథ‌రావు న‌క్కిన‌-ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ ఇద్ద‌రు మ‌రోసారి రవితేజ తో ధమాకా అనే బ్లాక్ బస్టర్ కొట్టారు. 100 కోట్లకు పైగా గ్రాసును కలెక్ట్ చేసి రికార్డులను క్రియేట్ చేశారు. ధమాకా చిత్రంలో కూడా చెప్పుకోవడానికి అంటూ కథ ఏమీ లేదు. ఎంటర్టైన్ మిక్స్ చేసి పెట్టడంతో ఆడియ‌న్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జోడీ జోరు మీద ఉన్న సందర్భంగా దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కెరీర్ లో వచ్చిన హిట్ సినిమాలలో నేను లోకల్ మూవీకి సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మూవీ లో హీరో క్యారెక్టర్ రైజేషన్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయిందని అందుకే ఛాన్స్ దొరికితే నేను లోకల్ కి సీక్వెల్ తీస్తానని తన మనసులో మాట బయటపెట్టారు. అయితే నేను లోకల్ సినిమాలో సీక్వెల్ తీసే అంత క‌థ‌, ద‌మ్ము ఏముంది అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. అసలు ఈ సినిమా హిట్ కావడమే పెద్ద లక్. దానికి సీక్వెల్ ఏముందని తీస్తారు అని పోస్ట్లు పెడుతున్నారు. క‌థాబ‌లం ఉంటే చిత్రం సీక్వెల్ పై దృష్టి పెట్టవచ్చు. కానీ ఒక మామూలు కమర్షియల్ సినిమాకి సీక్వెల్ చేయాలంటే మాత్రం కచ్చితంగా చాలా వర్క్ చేయాల్సి ఉంటుందని వారు కామెంట్ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.