English | Telugu

చిగురించిన నయనతార ప్రేమ



ప్రేమను ప్రేమించే ప్రేమకై, ప్రేమ ఎంత కాలమైనా వేచివుంటుంది. తడబడ్డా, పొరబడ్డా మళ్లీ మళ్లీ ఎదురుపడుతూనే వుంటుంది. సరే కొంచెం కష్టంగా ఉన్న ఈ విషయాన్ని, తిన్నగా చదువుకోండి.


కొన్నేళ్ల క్రితం నయనతార, శింభూ వీరిద్దరూ రేపో, మాపో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు విశేషంగా వచ్చాయి. హాట్ హాట్ ఫోటోలు, విడియోలు కూడా తెగ ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవటం, నయనతార - ప్రభుదేవాతో, శింభూ-హన్సికతో జతకట్టడం జరిగాయి, పోయాయి. అదే ఆ జతలు విడిపోయాయి. ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చింది. ఆ వ్యవహారం ఆ తర్వాత పూర్తిగా విఫలమయింది. నయనతార ప్రేమలు, పెళ్ళిళ్లు కాదని కెరీర్ మీద దృష్టి మళ్లించింది. అలా తమిళ్, తెలుగులో మళ్లీ తన తరహా చిత్రాలు నటిస్తోంది. ఈ గ్యాప్‌లో అటు శింభూ హన్సికను ఘాడంగా ప్రేమించి వదిలిపెట్టాడు.


ఈ పాత ప్రేమికులిద్దరూ ఆ తర్వాత కొంతకాలం పాటు ఒంటరివాళ్లు అవటం, అనుకోకుండా ఒక చిత్రంలో కలిసి నటించడం అంతా సినిమా కథలాగే నడుస్తోంది. తాజాగా వీరిద్దరూ పండియరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఇదు నమ్మ ఆలు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చేరువ వీరికి తమ పాత ప్రేమను చిగురింప చేసినట్లుంది. వీరిద్దరూ ఈ మధ్య పార్టీలకు కలిసి వెళ్తు, కలిసి తిరుగుతూ కనిపిస్తున్నారుట. ఇటీవల వీరిద్దరి స్నేహితురాలు, సినీతార త్రిష పుట్టినరోజు పార్టీలో జంట పక్షుల్లా కనిపించారట నయన, శింభూ. చాలాకాలం తర్వాత వీరిద్దరినీ నవ్వుతూ చూసిన వాళ్లు చూడముచ్చటగా ఉన్న వీళ్లు త్వరలో పెళ్లి కార్డు చేతిలో పెట్టినా ఆశ్చర్యం లేదు అనుకున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.