English | Telugu

రెండో సాంగ్ రిలీజ్ చేసిన అక్కినేని నాగార్జున 

కర్ణాటకలోని హళిబేడు, బేలూరులలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం శాంతల..ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలని నిర్మించిన కే ఎస్ రామారావు సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై శాంతల చిత్రం రూపుదిద్దుకుంది. అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ హీరోయిన్ గా నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వం లో వస్తున్న చిత్రం శాంతల. ఈ చిత్రంలోని రెండో పాట చెలి మోహమే అనే పాటను హీరో కింగ్ నాగార్జున విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రంలోని రెండో పాటని నాగార్జున గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాగార్జునగారు రిలీజ్ చేసిన చెలి మోహమే పాటను ఎస్ పి బి చరణ్ పాడగా కృష్ణ కాంత్ సాహిత్యం అందించాడు. సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమకూర్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ శాంతల చిత్రానికి సంగీతాన్ని అందించారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలని అందించాడు. నవంబర్ 17 న శాంతల చిత్రం విడుదల కాబోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.