English | Telugu

పవన్ కళ్యాణ్ కి ఫ్లైట్ ఇచ్చిన నాగార్జున 

అక్కినేని అండ్ మెగా కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ నాటిది కాదు. మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం కొనసాగుతు ఉంది.మెగాస్టార్ , ఏయన్ఆర్ ని గురువు గారు అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అలాగే చిరంజీవి ఫారెన్ వెళ్ళినప్పుడల్లా నాగేశ్వరరావు గారికి గిఫ్ట్ లని కూడా తీసుకొచ్చి ఇస్తుంటారు. ఇదే అనుబంధాన్ని కంటిన్యూ చేస్తు చిరంజీవి నాగార్జునలు కూడా చాలా సోదర భావంతో మెలుగుతు ఉంటారు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. కానీ ఆ బంధం చిరు నాగ్ ల వరకే కాదు అని నిరూపితమైన ఒక సంఘటన మెగా అక్కినేని కుటుంబాలకి చెందిన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తుంది.

పవన్ కళ్యాణ్ తాజాగా వైజాగ్ లో ఉన్న మత్యకారుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్లాడనే విషయం అందరికి తెలిసిందే. పవన్ అక్కడికి వెళ్లే ముందు కొన్ని అనివార్య కారణాల వలన పవన్ వెళ్ళాలసిన ఫ్లైట్ మిస్ అయ్యింది. దాంతో పవన్ కళ్యాణ్ నాగార్జున కి ఫోన్ చేసి పరిస్థితి వివరించగానే నాగ్ తన ప్రత్యేక ఫ్లైట్ ని పవన్ కళ్యాణ్ కి పంపించాడు. నాగ్ కి చెందిన ఆ ఫ్లైట్ లోనే పవన్ వైజాగ్ వెళ్ళాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇన్నాళ్లు నాగార్జునకి ,చిరంజీవి కి మధ్యనే చాలా సాన్నిహిత్యం ఉందని అందరు భావించేవారు. ఎప్పుడు కూడా పవన్ కి నాగార్జున కి మధ్య అంత బాండింగ్ ఉందని ఎవరికీ తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పవలిసి వస్తుందంటే నాగార్జున తన ప్రత్యేక ఫ్లైట్ ని బయట వ్యక్తులకి ఇవ్వడు.కేవలం తను,నాగ చైతన్య,అఖిల్ మాత్రమే దాన్ని వాడతారు. అలాంటిది పవన్ అడగ్గానే నాగ్ ఫ్లైట్ ని పంపించాడంటే వాళ్ళిద్దరి మధ్య బయట ప్రపంచానికి తెలియని అన్యోన్యత ఉందని అందరు అనుకుంటున్నారు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.