English | Telugu

షిర్డి సాయిబాబాగా నాగార్జున

షిర్డి సాయిబాబాగా నాగార్జున నటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే షిర్డీ సాయిబాబాగా యువ సామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున నటించబోతున్నారట. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్నారట. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో "అన్నమయ్య", "శ్రీరామదాసు" వంటి భక్తిరసభరిత చిత్రాలు వచ్చాయి. ఆ రెండు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ముందు "అన్నమయ్య" చిత్రం నిర్మాణంలో ఉండగా ఆ చిత్రం గురించి ప్రేక్షకుల నుంచీ, సినీ పండితుల నుంచీ, సినీ విమర్శకుల నుంచీ చాలా దారుణమైన విమర్శలు వచ్చాయి. "అన్నమయ్యకు మీసాలేమిటి...? అయినా శివ వంటి సినిమాలో సైకిల్ చైన్ పట్టుకుని ఫైటింగులు చేసే నాగార్జున అన్నమయ్య వంటి పరమ పవిత్ర వాగ్గేయకారుడి వేషం వేయటమా...? హీరోయిన్ల బొడ్డు మీద పళ్ళూ పాలూ వేసి, వారి అందాలను ఎక్స్ పోజింగ్ చేసే రాఘవేంద్రరావు భక్తిరస ప్రథానచిత్రం తీయటమా...? అంటూ నానా గొడవ చేశారు. కానీ "అన్నమయ్య" సినిమా విడుదలయ్యాక విమర్శకులందరి నోళ్ళు మూతపడ్డాయి. ఈ రోజున " అన్నమయ్య " డి.వి.డి. లేని తెలుగిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ షిర్డీ సాయిబాబా చిత్రం నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో రాబోతున్న హేట్రిక్ భక్తిరసచిత్రం. ఈ చిత్రంలో సాయిబాబా గెటప్ లో ఉన్న నాగార్జున స్టిల్ మీరు చూడవచ్చు. బహుశా "రాజన్న" చిత్రం తర్వాత ఈ సాయిబాబా సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.