English | Telugu

తండేల్ సినిమా చూసి నాగార్జున రియాక్షన్..!

అక్కినేని ఫ్యామిలీ ఒక భారీ విజయాన్ని అందుకొని చాలా కాలమైంది. దీంతో 'తండేల్' సినిమాపైనే అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని, తాజాగా నాగార్జున ప్రత్యేకంగా వీక్షించినట్లు తెలుస్తోంది. (Thandel)

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'తండేల్'. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా, పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల నిజ జీవితం ఆధారంగా రూపొందింది. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న 'తండేల్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. అలాగే ఇటీవల నిర్మాత అల్లు అర్జున్ ఈ సినిమా చూసి డిస్టింక్షన్ లో పాస్ అని స్టాంప్ వేసేశారు. ఇక ఇప్పుడు నాగార్జున సైతం తండేల్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తాజాగా తండేల్ టీం నాగార్జునకు స్పెషల్ షో వేసి చూపించారట. సినిమా చూసిన నాగార్జున, చాలా బాగా తీశారని టీంని మెచ్చుకున్నారట. చైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారట. (Nagarjuna)

తండేల్ మూవీ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే, చైతన్య కెరీర్ లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా తండేల్ నిలుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.