English | Telugu

నాగ్ ఏం ప్లాన్ వేశాడండీ..

చిన్న సినిమా తీసి, దానికి భారీ ప్ర‌మోషన్లు జోడించి సినిమాకి క్రేజ్ తెచ్చుకొని, రెట్టింపు లాభాలు తెచ్చిపెట్ట‌డం ఇప్ప‌టి లేటెస్ట్ టెక్నిక్‌. ఉయ్యాల జంపాల సినిమాకి నాగార్జున అదే చేశాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ పై అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో నిర్మించిన ఈ సినిమా మంచి లాభాల్ని సంపాదించుకొంది. ఇప్పుడు మ‌రోసారి నాగ్ అలాంటి స్కెచ్చే వేస్తున్నాడు. కొత్త వాళ్ల‌తో `నిర్మలా కాన్వెంట్‌` అనే ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు నాగ్.

టైటిల్ భ‌లే క్యాచీగా ఉంది క‌దూ. పైగా నాగ్ నిర్మాత అంటే ఈ సినిమాకి విప‌రీత‌మైక క్రేజ్ వ‌చ్చేస్తుంది. ఇంకో విశేషం.. ఈ సినిమాతో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇవ్వ‌డం. శ్రీ‌కాంత్ త‌న‌యుడి తొలి సినిమా అంటే అదో స్పెష‌ల్ క్రేజ్‌. దీనికి ఇంకాస్త స్పెషాలిటీ యాడ్ చేస్తున్నాడు నాగ్. ఈసినిమాలో తానూ ఓ కీల‌క పాత్ర క‌నిపిస్తాడ‌ట‌. అంటే... ఇది నాగ్ సినిమానే చాలామ‌ణీ అవ్వ‌బోతోంద‌న్న‌మాట‌.

కోటి రూపాయ‌ల వ్య‌యంతో సినిమా పూర్తి చేసి, భారీ ప్ర‌మోష‌న్లు క‌ల్పించి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు నాగ్‌. అలాగైతే క‌నీసం రూ.10 నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కూ ఈ సినిమా బిజినెస్ జ‌రుపుకొంటుంది. అంటే కోటి రూపాయ‌ల‌కు ప‌దిహేను కోట్ల వ్యాపారం అన్న‌మాట‌. దీనికి మించిన స్కెచ్ ఇంకేముంటుంది???

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.