English | Telugu

అనుష్క కీ అదే షాక్ త‌గులుతుందా?

ఇది వ‌ర‌కు క‌థానాయ‌కుల పారితోషికంతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపించేవి. ఇప్పుడు హీరోయిన్లు కూడా వాళ్ల‌తో పోటీకొస్తున్నారు. టాప్ పొజీష‌న్ ద‌క్కితే చాలు.. 'కో.. కో.. కోటి' అంటూ కోడై కూస్తున్నారు. స్టార్ క‌థానాయిక కావాలంటే ఆ మాత్రం ఇచ్చుకోక త‌ప్ప‌డం లేదు. ఇప్పుడు.. క‌థానాయిక‌లూ తెలివి మీరారు. 'హీరోల్లానే మాకూ లాభాల్లో వాటా కావాల‌'ని డిమాండ్ చేస్తున్నారు.

మొన్న‌టికి మొన్న 'జ్యోతిల‌క్ష్మి' కోసం ఛార్మి పారితోషికం తీసుకోకుండా వాటా అడిగింది. చివ‌రికి ఆమెకు రిక్త హ‌స్తాలే మిగిలాయ్ అనుకోండి.. అది వేరే విష‌యం. ఇప్పుడు అనుష్క కూడా అదే పాట పాడుతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు న‌టిస్తున్న చిత్రం సైజ్ జీరో. సినిమా అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుంది. కాల్షీట్లు కూడా భారీగానే కేటాయించింది. మామూలుగా అయితే.. ఈ సినిమాకి రెండు కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకోవ‌చ్చు. కానీ అనుష్క మాత్రం పారితోషికం వ‌ద్దు.. లాభాల్లో వాటా కావాలంద‌ట‌.

ఎందుకంటే ప‌రిమిత బ‌డ్జెట్‌లో తెర‌కెక్కిన చిత్ర‌మిది. తెలుగు, త‌మిళం రెండు వైపుల నుంచీ మార్కెట్ ఉండేలా చూసుకొన్నారు. క‌నీసం రెండు చోట్లా రూ.30 కోట్లు వ‌చ్చినా.. అనుష్క‌కి బాగానే గిట్టుబాటు అవుతుంది. క‌నీసం రూ.4 కోట్ల‌యినా రాబ‌ట్టుకోవ‌చ్చు. అందుకే... అనుష్క 'వాటా' వైపే మొగ్గుచూపింద‌ట‌. సినిమా వ‌ర్క‌వుట్ అయితే ప‌ర్వాలేదు.. అనుకొన్న సొమ్ము వ‌స్తుంది. వ‌ర్ణ‌లా వాష‌వుట్ అయితే మాత్రం.. ఛార్మికి పట్టిన గ‌తే ప‌డుతుంది. ఆ విష‌యం తెలీయ‌ట్లేదు అమ్మ‌డికి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.