English | Telugu

పుష్ప 2 రిలీజ్ టైంలో నాగబాబు ట్వీట్.. బెదిరిస్తున్నావా అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

తెలుగు సినిమాప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నాగబాబు.నటుడుగా,నిర్మాతగా తన సత్తా చాటి ప్రేక్షకుల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని పొందిన నాగబాబు, తన సోదరుడు పవన్ కళ్యాణ్(pawan kalyan)స్థాపించిన జనసేన(jansena)పార్టీలో క్రియాశీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో దిట్ట.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ట్వీట్ చెయ్యడం జరిగింది.

నాగబాబు(naga babu)సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ 'ఎక్స్' వేదికగా 'నువ్వు వెళ్లే దారి తప్పు అని గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకో.అలా కాకుండా ఎక్కువ కాలం వేచి ఉన్నావంటే మళ్లీ వెనక్కి తిరిగి రావడం కష్టమవుతుందని ట్వీట్ చేసాడు.మరి నాగబాబు ఏ ఉద్ద్యేశంతో ఈ ట్వీట్ చేసాడో తెలియదుగాని, అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)రిలీజ్ కి మరికొన్ని రోజులే ఉన్న టైం లో నాగబాబు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో జనసేన తరుపున కాకుండా వైసిపీ తరుపున పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి కి మద్దతుగా నిల్చినప్పట్నుంచి మెగా, అండ్ అల్లు అర్జున్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఆ సమయంలో కూడా నాగబాబు 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు, మావాడైనా పరాయివాడే,మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్ చేసాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగబాబు చేసిన నయా ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది.ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే నాగబాబు ట్వీట్‌పై మండిపడుతున్నారు. రిలీజ్‌కి ముందు బెదిరిస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న దృష్ట్యా అల్లు అర్జున్ స్పీచ్ మీద అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది.ఇక పుష్ప 2 పై ఇప్పటికి దాకా మెగా కాంపౌండ్ సైలెంట్ గా ఉండటం విశేషం.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.