English | Telugu

ప్ర‌భాస్ వ‌ర్సెస్ తార‌క్‌:  ప్రాజెక్ట్ సైఫ్‌

రెండు మూడు రోజులుగా ఇంట‌ర్నెట్ మొత్తం రామ మంత్రంతో హోరెత్తింది. జై శ్రీరామ్ అని వినిపించిన ప్ర‌తిచోటా రావ‌ణాసురుడి ప్ర‌స్తావ‌న ఉండే తీరుతుంది క‌దా. అలా ప్ర‌భాస్ సినిమా ఆదిపురుష్ గురించి మాట్లాడిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ విల‌న్ సైఫ్ గురించి కూడా ప్ర‌స్తావిస్తున్నారు జ‌నాలు. నార్త్ మీడియా అయితే ప్ర‌భాస్‌రాముడికి సైఫ్ లంకేష్ ప‌ర్ఫెక్ట్ గా దొరికాడు. స్క్రీన్ మీద పాజిటివ్ వైబ్స్ ఇట్టే క‌నిపిస్తున్నాయి అని అంటున్నారు. తిరుప‌తిలో ఆదిపురుష్ వేడుక‌కు రెండున్న‌ర‌కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని, బాణాసంచాకే 50ల‌క్ష‌లు పెట్టార‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న ద‌గ్గ‌ర మాత్రం ఇంట్ర‌స్టింగ్ టాపిక్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. సైఫ్‌ని తెలుగుకు ప‌రిచ‌యం చేసిన క్రెడిట్ ప్ర‌భాస్ కి చెందుతుందా? తార‌క్‌కి చెందుతుందా? అన్న‌దే ఆ టాపిక్‌. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఆదిపురుష్‌కి డైర‌క్ట‌ర్ ఔం ర‌వుత్‌. నార్త్ డైర‌క్ట‌ర్‌. నిర్మాణ సంస్థ కూడా మెజారిటీగా నార్త్ దే. తార‌క్ న‌టిస్తున్న సినిమాకు నిర్మాత‌లు తెలుగువారు.

ద‌ర్శ‌కుడు తెలుగువారు. ప్ర‌భాస్ తెలుగువాడైనా, ఎక్కువ ఓట్లు నార్త్ కే ప‌డుతున్నాయి కాబ‌ట్టి, అది నార్త్ మూవీ కిందే లెక్క‌. సో తార‌క్ దేవ‌ర మూవీనే సైఫ్‌కి ఫ‌స్ట్ తెలుగు సినిమా అంటూ ఒక వెర్ష‌న్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు తార‌క్ ఫ్యాన్స్. అదెలా కుదురుతుంది? ప్ర‌భాస్ స్క్రీన్ మీద యాక్ట్ చేస్తే అది తెలుగు సినిమానే అవుతుంది. కాబ‌ట్టి ఆదిపురుష్ తెలుగు మూవీనే, ఆ సినిమాతోనే సైఫ్‌కి తెలుగుకు ఇంట్ర‌డ్యూస్ అయిన‌ట్టు అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. బాలీవుడ్ హీరో కేంద్రంగా జ‌రుగుతున్న ఈ చ‌ర్చ‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది నార్త్ మీడియా. వ‌చ్చే రెండు వారాలూ దేవ‌ర సెట్లో ఉంటారు సైఫ్‌. దేవ‌ర చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎలా రీచ్ అయ్యేలా చేయాలోన‌నే విష‌య‌మై తానూ, తార‌క్ చాలా సార్లు మాట్లాడుకున్నామ‌న్న‌ది సైఫ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.