English | Telugu

'NBK111' అప్డేట్ వాయిదా.. కారణం తెలుసా..?

ఈరోజు రావాల్సిన నందమూరి బాలకృష్ణ 111వ సినిమా 'NBK111' అప్డేట్ వాయిదా పడింది. ఇది అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ.. ఇలాంటి సమయంలో ఈ వాయిదా నిర్ణయం సరైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'వీరసింహారెడ్డి' తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమా కోసం జత కట్టారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో గతంలో 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో మా మహారాణిని సోమవారం(నవంబర్ 3) మధ్యాహ్నం 12:01 గంటలకు పరిచయం చేయబోతున్నామంటూ.. 'NBK111' టీమ్ ఆదివారం నాడు ప్రకటించింది.

అయితే ఈ తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు .

చేవెళ్లలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు రావాల్సిన అప్డేట్ ని వాయిదా వేస్తున్నట్లు 'NBK111' టీమ్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

Also Read: కుర్రకారును ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం