English | Telugu

'NBK111' అప్డేట్ వాయిదా.. కారణం తెలుసా..?

ఈరోజు రావాల్సిన నందమూరి బాలకృష్ణ 111వ సినిమా 'NBK111' అప్డేట్ వాయిదా పడింది. ఇది అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ.. ఇలాంటి సమయంలో ఈ వాయిదా నిర్ణయం సరైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'వీరసింహారెడ్డి' తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరో సినిమా కోసం జత కట్టారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో గతంలో 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.

హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో మా మహారాణిని సోమవారం(నవంబర్ 3) మధ్యాహ్నం 12:01 గంటలకు పరిచయం చేయబోతున్నామంటూ.. 'NBK111' టీమ్ ఆదివారం నాడు ప్రకటించింది.

అయితే ఈ తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు .

చేవెళ్లలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు రావాల్సిన అప్డేట్ ని వాయిదా వేస్తున్నట్లు 'NBK111' టీమ్ ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

Also Read: కుర్రకారును ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.