English | Telugu

జర్నీ సినిమాని గుర్తు చేస్తున్న వరుస బస్సు ప్రమాదాలు!

ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం కర్నూల్ జిల్లాలో బైక్ ను ఢీకొని ఒక ప్రైవేట్ బస్సు ఆగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చేవెళ్ళలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. (Chevella Bus Accident)

సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో బస్సు జర్నీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఈ ప్రమాదాలు 'జర్నీ' సినిమాని గుర్తు చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.

జర్నీ సినిమాలో అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా రెండు బస్సులు ఘోర ప్రమాదానికి గురవుతాయి. ఎన్నో ఆశలు, కలలతో బస్సు ఎక్కిన పలువురి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతాయి. మరికొందరు అయినవాళ్ళను పోగొట్టుకొని ఎవరూ తీర్చలేని వేదనను అనుభవిస్తారు.

జర్నీ సినిమాలోని ఆ యాక్సిడెంట్ సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. కేవలం సినిమాలోని సన్నివేశాలే అంత బాధ కలిగిస్తే.. ఇక నిజ జీవితంలో ఆ ప్రమాదం ఎంతటి బాధను కలిగిస్తుందో మాటల్లో వర్ణించడం కష్టం.

కర్నూల్, చేవెళ్ళలో జరిగిన ఈ ఘోర ప్రమాదాలు అందులో మృతి చెందిన వారి కుటుంబాలకే కాదు.. అందరికీ బాధను కలిగిస్తున్నాయి. అతివేగం ప్రమాదకరం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు మరింత బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం