English | Telugu

'ఐ డోంట్ కేర్' అంటున్న బాలయ్య!

కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ని పెట్టారు. బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి ఘన విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.

'NBK 108' చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ఖరారు చేశారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే అదే టైటిల్ ని ప్రకటిస్తూ తాజాగా మూవీ టీం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. అదొక భారీ యాక్షన్ సన్నివేశంలోని స్టిల్ అని చూడగానే తెలుస్తోంది. జాతీయ చిహ్నం వచ్చేలా డిజైన్ చేసిన 'భగవంత్ కేసరి' టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. ఇక టైటిల్ కి 'ఐ డోంట్ కేర్' అనే ట్యాగ్ లైన్ జోడించడం చూస్తుంటే బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అర్థమవుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల కానుంది.

బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) సందర్భంగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ సందడి మొదలైంది. ఈరోజు 'NBK 108' టైటిల్ ని రివీల్ చేశారు. జూన్ 10న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే బాలయ్య తదుపరి చిత్రం 'NBK 109' ప్రకటన కూడా రానుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.