English | Telugu

సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి మృతి: చిత్ర‌సీమ దిగ్భ్రాంతి

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి (40) ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లో గుండెపోటుతో మ‌ర‌ణించారు. దాదాపు 90 చిత్రాల‌కు సంగీతం అందించారు. ఆయ‌న తొలి చిత్రం బాచి. ఎర్ర‌బ‌స్సుకీ ఆయ‌న స్వరాలు స‌మ‌కూర్చారు. చ‌క్రి మ‌ర‌ణ‌వార్త విన‌గానే చిత్ర‌లోకమంతా షాక్‌కి గురైంది. ఆదివారం అర్థరాత్రి వ‌ర‌కూ ఆయ‌న రికార్డింగ్‌ప‌నుల‌తో బిజీగా గ‌డిపారు. తెల్ల‌వారుఝామున గుండెనొప్పితో ఆసుప‌త్రిలో చేరారు. అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించారు. హుషారుపాట‌ల‌కే కాదు, మెలొడీ గీతాల‌కూ చ‌క్రి ప్ర‌సిద్ది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎన్నో హిట్ చిత్రాల‌కు బాణీలు అందించారు. ఇడియ‌ట్‌, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం, ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు, స‌త్యం, ఢీ, మ‌స్కా, దేవ‌దాసు... ఇలా ఎన్నో హిట్ చిత్రాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. సింహా చిత్రానికి ఆయ‌న నంది అవార్డు అందుకొన్నారు. చ‌క్రి మృతి ప‌ట్ల‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇంత చిన్న వ‌య‌సులో తెలంగాణ చిత్ర‌ప‌రిశ్ర‌మ ఓ గొప్ప సంగీత ద‌ర్శ‌కుడ్ని కోల్పోయింద‌న్నారు. చ‌క్రి మ‌ర‌ణ వార్త తెలియగానే సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులంతా షాక్ తిన్నారు. చ‌క్రి స్వ‌గృహంలో ఇప్పుడు విషాద ఛాయ‌లు అలుముకొన్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.